BREAKING: హైదరాబాద్‌లో 11 చైనా వైరస్ కేసులు.. ప్రభుత్వం డేంజర్ బెల్స్!

చైనాలో శరవేగంగా విస్తరిస్తున్న హెచ్‌ఎంపీవీ కేసు మన దేశంలోనూ నమోదైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే మన దేశంలో పదికి పైగా కేసులు నమోదయ్యాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దీంతో దేశ ప్రజలందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. మళ్లీ కరోనా పరిస్థితి వస్తుందా? మళ్లీ లాక్‌డౌన్‌ వస్తుందేమోనని అందరూ భయపడుతున్నారు. ఈ వైరస్ మన తెలుగు రాష్ట్రాలకు ఎక్కడ వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఈ వైరస్ కేసులు పెద్దగా ప్రభావం చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆంక్షలు విధించారు. ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని వారు భయపడుతున్నారు.

హైదరాబాద్‌లో 11..

అందరూ ఆందోళన చెందుతున్నట్లుగానే హైదరాబాద్‌కు కూడా ఈ వైరస్ సోకిందని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో 11 చైనా వైరస్ కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని మణి మైక్రోబయోలాజికల్ ల్యాబ్‌లో 11 హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు గుర్తించినట్లు గుర్తించారు. గతేడాది డిసెంబర్‌లో ఈ ల్యాబ్‌కు వచ్చిన 258 మందికి వైరల్ ఇన్‌ఫెక్షన్లు సోకగా, వారిలో 11 మందికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఇప్పుడు ప్రజల్లో భయాందోళన నెలకొంది.

శుభవార్త ఏమిటి?

అయితే హైదరాబాద్‌లోని మణి మైక్రోబయోలాజికల్ ల్యాబ్ దీనికి సంబంధించి శుభవార్త చెప్పింది. వైరస్ సోకిన వారందరికీ విజయవంతంగా చికిత్స అందించామని, వారందరినీ డిశ్చార్జ్ చేశామని చెప్పారు. ప్రస్తుతం వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, వారందరూ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. దీంతో ఈ వార్త విన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం లేదు..

ఈ వైరస్ అందరూ అనుకున్నంత ప్రమాదకరం కాదని హైదరాబాద్ లోని మణి మైక్రోబయోలాజికల్ ల్యాబ్ ప్రతినిధులతో పాటు వైద్యులు కూడా చెబుతున్నారు. ఇది సాధారణ జ్వరమేనని, వస్తున్న వదంతులను నమ్మవద్దని హితవు పలికారు. ఈ వైరస్ భారతదేశంలో కొత్తది కాదని, ఇది చాలా కాలంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు చెప్పారు.