
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది.. నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 25 వరకు తుపాన్గా మారితే దానికి రెమల్గా నామకరణం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
కోస్తాంధ్రలోని కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పార్వతీపురం మన్యంతోపాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు అనకాపల్లి, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
[news_related_post]ఈశాన్య దిశగా కదులుతున్న గాలి తూర్పు-మధ్య బేలో తుఫాన్గా మారుతుంది. ఈ నెల 25 నాటికి ఏపీ తీరం వెంబడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. మే 26 సాయంత్రానికి బంగ్లాదేశ్, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది.. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.. వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు మరియు రవాణా నౌకలకు హెచ్చరికలు.