ఏపీ: గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేకుండా రూ.3 లక్షల రుణం… ఎవరికి అంటే?

హస్తకళాకారుల కోసం కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను రాష్ట్రంలోని ‘ఆదరణ’ పథకంతో అనుసంధానించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇందుకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పథకంలో ఎంపికైన వారికి రెండు విడతల్లో రూ.3 లక్షల రుణం అందజేస్తారు. బ్యాంకులు వసూలు చేసే 13 శాతం వడ్డీలో 8 శాతం కేంద్రం భరిస్తుండగా, మిగిలిన 5 శాతం వడ్డీని లబ్ధిదారులు చెల్లించాలి. అయితే లబ్ధిదారులు చెల్లించే ఐదు శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో లబ్ధిదారులకు వడ్డీ లేకుండా రుణం అందనుంది.

ఆ రుణంలో కూడా కొంత రాయితీ ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చేతివృత్తులపై ఆధారపడి ఎంత మంది ఉన్నారనే దానిపై ప్రభుత్వం సర్వే చేయనుంది. సచివాలయ సిబ్బంది సహకారంతో ఈ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్వే తర్వాత ఆదరణ- విశ్వకర్మ యోజన అమలు చేసే అవకాశం ఉంది. సెప్టెంబరు 17, 2023న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. హస్తకళలు మరియు సాంప్రదాయ ఉపకరణాలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయం అందించాలనే లక్ష్యంతో ఇది స్థాపించబడింది.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *