SUMMER: ప్రజలకు అలర్ట్..ఏపీలోని ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను ఎండలు మండిస్తున్నాయి. ఉదయం నుంచి భానుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. ఈ క్రమంలో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ తీవ్రమైన ఎండ ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తీవ్రమైన ఎండలు, వేడిగాలుల కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక మండలాల్లో నేడు (శనివారం) తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఇటీవల వెల్లడించింది.

రాష్ట్రంలో వాతావరణంలో వేర్వేరు మార్పులు కనిపిస్తున్నాయని తెలిసింది. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, చాలా చోట్ల వర్షాలు కురుస్తున్న వేడిగాలుల తీవ్రత తారాస్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు.

Related News

ఈ క్రమంలో నేడు (శనివారం) వేడిగాలుల తీవ్రత కొనసాగుతుందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నేడు 66 మండలాల్లో వేడిగాలులు ప్రబలుతాయని చెప్పబడింది. ఈ సమయంలో అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.