Big Alert:రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. నాలుగు రోజులు వడగళ్ల వాన!!

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తీవ్రమైన వేడిమి తాపడం మొదలైందని, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చాలా చోట్ల ఎండలు పెరిగాయి, మరికొన్ని చోట్ల వాతావరణం చల్లబడింది. ఇది ప్రజలకు కొంత ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు. కానీ చాలా జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాము పండించిన పంటలు కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష హెచ్చరిక జారీ చేసింది. మరో నాలుగు రోజులు అకాల వర్షాలు కురుస్తాయని, వడగళ్ళు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.