
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
దీనితో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం, కేరళ, కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఏపీలోని ఈ జిల్లాల్లో..
[news_related_post]ఈరోజు ఏపీ (ఆంధ్రప్రదేశ్)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం మరియు కర్నూలులో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని ఈ జిల్లాల్లో..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాలు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.