AP Weather: ఏపీ వాసులకు అలర్ట్‌.. ఆ జిల్లాల్లో ఈదురుగాలుల..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉదయం నుంచి ఎండలు మండిపోతుండగా, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లాలోని పసుపులో 42.5 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లాలోని రావిపాడులో 42.1 డిగ్రీలు, కర్నూలు జిల్లాలోని కలుగోట్లలో 41.8 డిగ్రీలు నమోదయ్యాయి. అయితే, మంగళవారం కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్రంలో 41-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా ఉండవచ్చునని తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Related News

రాష్ట్రంలో వర్షాలు, బలమైన ఈదురుగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హోర్డింగ్‌లు, చెట్లు, శిథిలమైన గోడలు మరియు భవనాల దగ్గర ప్రజలు నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు. రైతులు ఎండిన ధాన్యాన్ని తడి చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు చెబుతున్నారు.