TENTH EXAMS: విద్యాశాఖ కీలక ప్రకటన.. పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..!!

రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ఈ నెల 21 నుండి వచ్చే నెల 4 వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

10వ తరగతి పబ్లిక్ పరీక్షల తర్వాత సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 7 నుండి 15 వరకు జరుగుతుంది. పరీక్షా కేంద్రాలలో సీసీటీవీ నిఘా ఉంటుంది. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News