
EDUCATION MINISTER LOKESH
తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనసభలో మంత్రి ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపన మరియు క్రమబద్ధీకరణ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే ప్రైవేట్ యూనివర్సిటీల చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచనతో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. గతంలో విశాఖపట్నంలో సెంచూరియన్ యూనివర్సిటీని స్థాపించామని ఆయన అన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో సంస్థాగత మార్పుల లక్ష్యంతో ఈ సవరణ బిల్లును తీసుకువచ్చామని ఆయన అన్నారు.
రాష్ట్రంలో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లను స్థాపించడానికి కూడా కృషి చేస్తామని మంత్రి చెప్పారు. ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలానీ సంస్థ కోసం అమరావతిలో 70 ఎకరాలు కేటాయించామని వివరించారు. టాటా వంటి కంపెనీలు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో డీప్ టెక్ యూనివర్సిటీని స్థాపించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. విశాఖపట్నంలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీ రావాలని అన్నారు. దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీల క్యాంపస్లు ఏపీలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.