Annavaram: అన్నవరం సత్యదేవుడి ఆలయంలో అపచారం..!!

కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్యదేవ్ ఆలయంలో ఒక దుర్ఘటన జరిగింది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సందర్శించే ఈ ఆలయంలోని గదుల్లో ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. భక్తుల కోసం కొండపైనే కాకుండా కింద కూడా కాటేజీలు ఉన్నాయి. అయితే, వీటిని ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దీంతో భక్తులు ఈ కాటేజీలలో బస చేసి, స్వామి దర్శనం చేసుకుని, తమ స్వస్థలాలకు తిరిగి వెళతారు. అయితే, ఈఓ ఈ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సత్యానికేతన్‌లో ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. దీంతో మందుబాబులు ఎవరు అని ఆరా తీస్తున్నారు.

ఈ సందర్భంలో ఆలయ సిబ్బంది, భద్రతా పోలీసులు కొన్ని రోజులుగా సత్యానికేతన్ సత్రంలోని ఏడు గదుల్లో బస చేస్తున్నారు. వారు గదుల్లోకి మద్యం సీసాలు తెచ్చి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఈ సంఘటనపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించారు. గదుల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఈఓ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని ఈఓ పేర్కొన్నారు.

Related News