Andhra Pradesh: ఏపీకి గుడ్ న్యూస్.. కొత్తగా మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్కడంటే?

ఏపీ ప్రజలకు శుభవార్త.. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో 3 కొత్త విమానాశ్రయాలు నిర్మించబోతున్నారు. ఏపీలో కొత్త విమానాశ్రయాలకు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి K. రామ్మోహన్ నాయుడు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

శనివారం తిరుపతి-ఢిల్లీ ఇండిగో విమాన సర్వీసును రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలో త్వరలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం స్థలాలను పరిశీలించి కొత్త విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గతంలో దేశవ్యాప్తంగా 74 విమానాశ్రయాలు ఉండేవని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంఖ్య 157కి చేరింది.

రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గతంలో తిరుపతి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నేరుగా విమానం లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. అందుకే తిరుపతి-ఢిల్లీ మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను మరింత అభివృద్ధి చేసి సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుపతి, ముంబై, కోయంబత్తూరు, కలకత్తా నుంచి నేరుగా తిరుపతికి విమాన సర్వీసులు నడపాలన్న డిమాండ్ పెరుగుతోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. తిరుపతి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీని పెంచుతామని హామీ ఇచ్చారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు విమానాశ్రయాలకు అదనంగా మరో ఏడు విమానాశ్రయాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, పుట్టపర్తి సహా ఏడు చోట్ల విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాంతాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు, స్థలాన్ని పరిశీలించాలన్నారు. స్థలం దొరికితే త్వరలో విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *