7th Pay Commission DA : ఉద్యోగులకు శుభవార్త, రేపే DA పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా

7వ వేతన సంఘం DA హైక్ మరియు  దీపావళి బోనస్: 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం, జూలై నెలకు సంబంధించిన DA పెంపు ప్రకటన రేపు అంటే అక్టోబర్ 9న వెలువడవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు దసరా, దీపావళి నజరానా పొందనున్నారు. డీఏ బకాయిలతో పాటు దీపావళి బోనస్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి డీఏ ఎంత పెరుగుతుందో, బోనస్ ఎంత వస్తుందో చూడాలి.

దేశంలోని కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న డీఏ పెంపుపై ఇది కీలకమైన నవీకరణ. రేపు బుధవారం కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుపై ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈసారి డీఏ 3-4 శాతం మధ్య ఉండొచ్చు. అంటే మొత్తం డీఏ 50 నుంచి 53 లేదా 54 శాతానికి చేరుకోవచ్చు. మార్చి నెలలో డీఏలో 4 శాతం పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది.

Related News

ఇప్పుడు జూలై నెల డీఏ బకాయిలతో పాటు ఈ నెలలోనే అందుతుంది. అంతేకాకుండా ఈ నెలలో దీపావళి బోనస్ కూడా ఉంటుంది. ఉద్యోగులకు భారీ వేతనాలు అందుతాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చాలా ముఖ్యం.

7వ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండుసార్లు. ఇది జనవరి మరియు జూలై నెలల్లో AICPI సూచిక ఆధారంగా నిర్ణయించబడుతుంది. డీఏ 3 శాతం పెరిగితే, 18,000 మూల వేతనం ఉన్న వారికి డీఏ 9,000 నుంచి 9,540 రూపాయలకు పెరుగుతుంది. అదే 4 శాతం పెరిగితే మొత్తం డీఏ రూ.9,720 అవుతుంది.

అక్టోబర్ నెలలో డీఏ పెంపుతో ఉద్యోగులకు ఎంతో ఊరట లభించనుంది. ఎందుకంటే దసరా, దీపావళి అనే రెండు పండుగలు ఉన్నాయి. ఈ సమయంలో డీఏ పెంపుతో పాటు దీపావళి బోనస్ కూడా వస్తే అంతకంటే సంతోషం మరొకటి లేదు.

ఈ నెల జీతం భారీగా ఉంటుంది. మరోవైపు 8వ వేతన సంఘం ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. 7వ వేతన సంఘం 2016లో ఏర్పాటైంది.. ఇది 2026 వరకు చెల్లుబాటవుతుంది.ఈ నేపథ్యంలో ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పడితే అది అమల్లోకి వచ్చేసరికి 2026 కావచ్చు.

8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులు డీఏ పెంపుతో పాటు దీపావళి బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *